ఇస్రో రాకెట్ ప్రయోగం సక్సెస్
![ఇస్రో రాకెట్ ప్రయోగం సక్సెస్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_647444e1ab4aa.jpg)
జీఎస్ఎల్వీ ఎఫ్ 12 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 2వేల 232 కిలోల బరువుతో ఎన్వీఎస్ -01 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ప్రవేశపెట్టింది.. ఇస్రో ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. అమెరికా అందిస్తున్న జీపీఎస్ తరహా నేవిగేషన్ కోసం భారత్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఐఆర్ఎన్ఎస్ఎస్ నావిక్. అందులో భాగంగానే ఎన్వీఎస్ 1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ మొత్తం ఏడు ఉపగ్రహాల ప్రయోగం. ఇందులో భాగంగా గతంలో పంపిన నాలుగు ఉపగ్రహాల జీవితకాలం ముగిసింది.
సో.. వాటికి కొనసాగింపుగా ఐఆర్ఎన్ఎస్ఎస్ రెండో తరం నేవిగేషన్ శాటిలైట్ సిరీస్లో ఇప్పుడు పంపుతున్న ఎన్వీఎస్-1 మొదటిది. మొత్తం ప్రయోగాల ప్రక్రియ మొత్తం ఇప్పటి వరకూ జీపీఎస్పై ఆధారపడిన మనం ఇకపై దేశీయ నేవిగేషనల్ సేవలు పొందొచ్చు. భారత రక్షణరంగానికి, పౌర విమానయాన రంగానికి ఇస్రో అభివృద్ధి చేస్తున్న ఐఆర్ఎన్ఎస్ఎస్ ఎంతో మేలు చేయబోతోంది. ఇందులో రెండో తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్లో ఎన్వీఎస్1 మొదటిది. గతంలో నావిగేషన్ సర్వీసెస్ కోసం పంపిన ఐఆర్ఎన్ఎస్ఎస్ఉపగ్రహాల్లో నాలుగింటి జీవిత కాలం ముగిసింది. ఆ సిరీస్లో భాగంగానే ఈ ఎన్వీఎస్ ఉపగ్రహాన్ని పంపేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.. ఇక ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ సిరీస్లో మరిన్ని శాటిలైట్లు ప్రవేశపెడతారు.