జూనియర్ పంచాయతీ కార్యదర్శులను  పర్మినెంట్ చేయాలి 

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను  పర్మినెంట్ చేయాలి 

హుజూర్ నగర్, ముద్ర: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ నాయకులు కోరారు. గురువారం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర జెసిపిలు మేరకు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి,ఇందిరా సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి శాంతియుత నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 లో నోటిఫికేషన్ ప్రకారం ఎంపికై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల  ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు ఉన్న తమని జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగుల కల్పిస్తున్న సౌకర్యాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ నాయకులు  బండారు చంటి, నాగమణి, ఉమా, జి నరేందర్ రెడ్డి, గీత, నరసింహ, నరేష్, నాగేంద్రబాబు, మోతిలాల్, వినయ్ కుమార్, సైదా నాయక్, జై సన్ రాజా, లక్ష్మణ్, బాలాజీ నియోజకవర్గంలోని ఏడు మండలాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు  పాల్గొన్నారు.