కల సాకారం..నాయకుల మేలు మరువం - ఎమ్మెల్యే గండ్ర కు స్థానికుల కృతజ్ఞతలు

కల సాకారం..నాయకుల మేలు మరువం - ఎమ్మెల్యే గండ్ర కు స్థానికుల కృతజ్ఞతలు

ముద్ర న్యూస్ రేగొండ: ప్రజల కల సాకారమైంది.పరిపాలనా సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ నూతన మండలాలు ఏర్పాటు చేయగా అందులో భాగంగా రేగొండ మండలాన్ని రెండు మండలలుగా ఏర్పాటు చేసరు.అదే గోరి కొత్తపల్లి మండలం. ప్రస్తుతం ఉన్న రేగొండ మండలం జిల్లాలోనే అతి పెద్ద మండలంగా ఉండేది.ఇప్పుడు కొత్తగా గోరి కొత్తపల్లి మండలం ఏర్పటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా చేసినందుకు గాను మండల తెరస్స నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గోరికొత్త పల్లి మండలం దామరంచ పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్. మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బండి కిరణ్ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి,గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.నూతనంగా గోరి కొత్త పల్లి మండలం ఏర్పాటు చేయడం అన0దంగా ఉందని,మండల ఏర్పాటు వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉంటుంది అని. అలాగే మండల ఏర్పాటు కొరకు అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం అహర్నిశలు కష్టపడతామని గోరి కొత్తపల్లి మండలం నుండి అధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు...