మంజీరా ఉదృతి... ఏడుపాయల ఆలయానికి తాళం

మంజీరా ఉదృతి... ఏడుపాయల ఆలయానికి తాళం

ముద్ర ప్రతినిధి, మెదక్: భారీ వర్షాలతో మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయానికి తాళం వేశారు. గురువారం ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం తాళం వేసిన ఆలయ సిబ్బంది, అర్చకులు రాజగోపురం వద్ద ఉత్సవ మూర్తి అమ్మవారికి పూజలు చేస్తున్నారు.