మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మార్కేట్ వైస్ చైర్మన్
![మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మార్కేట్ వైస్ చైర్మన్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645c94dd34bbe.jpg)
ముద్ర, తిరుమలగిరి: తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారంగా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన గుండు నరేష్ అనారోగ్యముతో ఇటీవల మృతిచెందగా. గురు వారం నాడు తిరుమలగిరి మార్కేట్ కమిటి వైస్ చైర్మన్ యారాల రాంరెడ్డి వర్ధమానుకోట ఎంపిటిసి -2 వడ్డే పరశురాములు నరేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి నరేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు 10,వేల- రూపాయల ఆర్థిక సాయం అందజేసి మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు*. ఈ కార్యక్రమంలో , ఉప సర్పంచ్ ఈదుల కిరణ్ కుమార్, బిఆర్ఎస్ గ్రామ శాఖ శాఖ అధ్యక్షులు, బండగోర్ల ఎల్లయ్య నాయకులు ఈదుల అరుణ్ కుమార్, మండల యూత్ ప్రచారా కార్యదర్శి ఎర్ర అశోక్ నంద, గుండు శీను, యాదగిరి, రామ్మూర్తి, జలంధర్, నరసయ్య, లింగమల్లు, మల్లయ్య, బిక్షం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.