వార్డులో నిరుపేదలకు రూ.లక్ష 10వేలు నగదు సాయం...

వార్డులో నిరుపేదలకు రూ.లక్ష 10వేలు నగదు సాయం...

మేళ్లచెరువు ముద్ర : అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు  మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీకి చెందిన 10వ వార్డు సభ్యురాలు సాముల ఉమా రూ.1,10,000 ఆర్థిక సాయం అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. మేళ్లచెరువు గ్రామానికి చెందిన గార్లపాటి ఈశ్వరమ్మ,ఎస్ కె జానీ, బోయ లక్ష్మి, తుమ్మ బాలస్వామి , షేక్ మీరాబీ, నల్లగంట్ల రామకృష్ణ, కొండరాయి నాగమ్మ, తెల్ల నాగలక్ష్మి , ఉప్పతల గుర్వమ్మ, పసుపులేటి జానమ్మ, అన్నెమ్మ లకు గ్రామపంచాయితీ కార్యాలయంలో ఒక్కోక్కరికి రూ.10వేల చొప్పున మేళ్లచెరువు గ్రామ సర్పంచ్ పందిళ్ళపల్లి శంకర్ రెడ్డి సమక్షంలో శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో  లబ్ధిదారులకు నగదు అందించారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ 10వ వార్డు సభ్యులు సాముల ఉమా మాట్లాడుతూ తన వార్డులో,  గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న 11మంది నిరుపేదలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు అందించినట్లు తెలిపారు.తనకు ఓటేసి గెలిపించిన వార్డు ప్రజలకు అండగా ఉండనున్నట్లు తెలిపారు. ఆర్థిక సాయం అందించిన 10వ వార్డు సభ్యులు సాముల ఉమా ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ పందిళ్ళపల్లి శంకర్ రెడ్డి, 4వ వార్డు సభ్యులు  మూడెం శ్రీనివాసరెడ్డి,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇరిగెల పోలిరెడ్డి,మోరిమేకల బసవయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు