వినాయకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

వినాయకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రెస్ క్లబ్ సభ్యులు

మెట్‌పల్లి ముద్ర: పట్టణంలోని దుబ్బవాడలో లోని ఎల్ ఎల్ వై యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా (టి యు డబ్ల్యూ జే ఐ జే యు) సభ్యులు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 22 వ వార్డు కౌన్సిలర్, ఆమే కుమారుడు జియా ఉల్ హక్ ఆహ్వానం మేరకు వినాయక పూజలో పాల్గొన్న ప్రెస్ క్లబ్ సభ్యులను యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు  అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ అద్యక్షుడు ఆగ సురేష్, ప్రధాన కార్యదర్శి భూరం సంజీవ్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజీమ్, సాజిద్, మహేందర్ యూత్ సభ్యులు ఉన్నారు.