మీలా వంశీ ఆధ్వర్యంలో 6000 లడ్డూ ప్రసాదాల పంపిణీ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
![మీలా వంశీ ఆధ్వర్యంలో 6000 లడ్డూ ప్రసాదాల పంపిణీ ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_651504a817f23.jpg)
ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఆర్యవైశ్య యువజన సంఘం,జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా 6000 ల లడ్డూల పంపిణీ చేయడం హర్షణీయమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట హెడ్ పోస్టాఫీసు వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నర్సయ్య ఆధ్వర్యంలో జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మీలా వంశీ ఏర్పాటు చేసిన 6000 లడ్డూ ప్రసాదాల పంపిణీ ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘాలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. సమాజ సేవలో జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు ఇమ్మడి నరసయ్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని అనేక సేవా కార్యక్రమాలు తన సొంత ఖర్చులతో చేస్తాడని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో సోమనర్సయ్య ఉదారత్వం అందరికీ ఆదర్శనీయమని మంత్రి ప్రశంసించారు ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉప్పల ఆనంద్, ఆర్యవైశ్య నాయకులు రాచకొండ శ్రీనివాస్, కలకోట లక్ష్మయ్య, బెలిదె శ్రీనివాసులు, యామా సంతోష్, శ్రీరంగం రాము, మిట్టపల్లి రమేష్, బజ్జూరి శ్రీనివాస్, దేవరశెట్టి సత్యనారాయణ, కర్నాటి వంశి, మిట్టసోమ సుమన్ తదితరులు పాల్గొన్నారు.