ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం  మార్నింగ్ వాక్ లో మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం  మార్నింగ్ వాక్ లో మంత్రి నిరంజన్ రెడ్డి

ఇండస్ట్రియల్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ గా మార్పు

ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో  మార్నింగ్ వాకింగ్ లో  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వనపర్తి ఇండస్ట్రియల్ ఏరియా జోన్ ను రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తూ ఉత్తర్వులు ఇప్పించామని, సమస్యల పరిష్కారానికి తమ బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నాం అని  అన్నారు. సత్వరమే మంచి నీటి బోర్ ను ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,  మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి, ప్రేమ్ నాథ్ రెడ్డి ,ఆవుల రమేష్ , నాగవరం నరేష్, సుభాష్, పేట  తిరుపతయ్య, వెల్డింగ్ రాములు, సూరి, సంపత్, శ్రీనివాసులు, ఎల్ఐసి రాములు,   కాలనీవాసులు పాల్గొన్నారు.