త్వరలో వికలాంగులకు ఎమ్మెల్యే పద్మ చేయూత 

త్వరలో వికలాంగులకు ఎమ్మెల్యే పద్మ చేయూత 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నియోజకవర్గంలోని వికలాంగులకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేయూతనందించేందుకు త్రీ వీలర్ మోపెడ్లు సిద్ధం చేయిస్తున్నారు. దాదాపు లక్ష రూపాయల వ్యయంతో హీరో  త్రిచక్ర వాహనం సిద్ధం చేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ,  మండలాలోని ఎంపికచేసిన వికలాంగులకు పద్మక్క చేయూత ద్వారా  హీరో కంపెనీ త్రిచక్ర వాహనాలను అందించనున్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా నియోజకవర్గంలోని వికలాంగులకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా త్వరలో అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.