వనదుర్గ సన్నిధిలో ఎమ్మెల్యే సునీతారెడ్డి

వనదుర్గ సన్నిధిలో ఎమ్మెల్యే సునీతారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఏడుపాయల శ్రీ వనదుర్గ మాతను నర్సాపూర్ ఎమ్మెల్యే వి. సునీతా రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఏడుపాయల రాగ రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేకపూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి అలాయ మర్యాదలతో సత్కరించారు.