బొల్లం మల్లయ్యను ఆశీర్వదించండి అభివృద్ధిలో భాగస్వామ్యం కండి - ఎమ్మెల్సీ రవీందర్రావు

బొల్లం మల్లయ్యను ఆశీర్వదించండి అభివృద్ధిలో భాగస్వామ్యం కండి - ఎమ్మెల్సీ రవీందర్రావు

మునగాల ముద్ర: రాబోయే శాసనసభ ఎన్నికలలో 40 రోజులపాటు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు, క్రేసి రకంగా పనిచేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ రవీంద్రరావు అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలో బూత్ కమిటీ ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఓటర్లను చైతన్యపరిచే బాధ్యత బూత్ లెవెల్ కార్యకర్తలేదే నని పార్టీ మినిస్ట్రీ గడపగడపకు ప్రచారం చేయాలని బూతులు కార్యకర్తలకు ఓటర్ జాబితా పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేవరకు బూతులు కార్యకర్తలు శ్రమించాలని సమన్వయంతో మరియు కార్యకర్తలకు అన్ని విలువలు అందుబాటులో ఉండాలన్నారు నియోజకవర్గంలో రికార్డ్స్ మెజార్టీతో గెలిపించి కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలన్నారు ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బిఆర్ఎస్ మేనిఫెస్టో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తగరు రమేష్ ,అజయ్ కుమార్ నల్లపాటి శ్రీనివాస్ ఎలక నరేందర్ రెడ్డి కోల ఉపేందర్ కందిబండ సత్యనారాయణ వెంకటరెడ్డి అంజయ్య ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.