అదానికి దోచిపెడుతున్న ప్రధాని మోదీ  

అదానికి దోచిపెడుతున్న ప్రధాని మోదీ  

మహబూబాబాద్: ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. తమతో పాటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏవర్గానికి ఏం చేసింది? అని ప్రశ్నించారు. బుధవారం తొర్రూరులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడరు. అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మతపరమైన మంటలు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రియమైన ప్రధాని కాదు...పిరమైన ప్రధాని అని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవన్నారు. 1550 కోట్ల రూపాయలను మహిళా రుణాలను ఇవాళ ఇస్తున్నామని తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయని కొనియాడారు. అందుకే మన రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.