మృతుల కుటుంబాలకు పరామర్శ

మృతుల కుటుంబాలకు పరామర్శ

సైదాపూర్,ముద్ర: ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హౌజ్ ఫెడ్ చైర్మన్ హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గురువారం పరామర్శించారు.మండలంలోని వెన్కేపల్లి చెందిన బత్తుల వెంకటయ్య, ఘనపూర్ కు చెందిన తీగల వజ్రమ్మ, నల్లని తండాకు చెందిన భూక్యా దేవేందర్, గొడిశాలకు చెందిన బోనగిరి మనోజు, రాంచంద్రపూర్ కు చెందిన పోతారం మహెందర్ ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

ఆయన వెంట బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, వెన్కేపల్లి ఎంపీటీసి జంపాల సంతోష్, ఘనపూర్ సర్పంచి తడిసిన వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కొండా మల్లయ్య,  జనరల్ సెక్రటరీ గాజుల రమేష్, ఓబిసి మండల  అధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, తంగెళ్ళ అశోక్ , బూత్ అధ్యక్షులు   వంగ సాగర్,  గుజ్జిక రాజమోగిలి, బండారి శ్రీనివాస్ , దొమ్మాటి వీరన్న,  రాహుల్,మునిపాల అశోక్,  మేడవేని నరేష్, సంధ్ధుపట్ల సత్యం, వేనగంటి రాజు వరప్రసాద్, మునిగంటి వేణు, రచ్చ రాజు, సుంకరి చక్రి, బత్తుల వారప్రసద్, కపిల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు