ముద్ర కథనానికి స్పందించిన అధికారులు, నాయకులు

ముద్ర కథనానికి స్పందించిన అధికారులు, నాయకులు

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో 'కబ్జాకు గురైన రోడ్డు, ఫిర్యాదుచేసిన పట్టించుకోని అధికారులు' వార్తలు రావడంతో ముద్ర కథనానికి స్పందించి అధికారులు కబ్జా చేసిన రోడ్డును గోడలను కూల్చివేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, హనుమాన్లపల్లి కాలనీలోని 8,10 వార్డులకు చెందిన 50 కుటుంబాలు కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న దాన్ని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ముద్ర కథనానికి స్పందించిన అధికారులు గోడను కూల్చివేశారు. కాలనీలోని నివాసం ఉండే కుటుంబాలకు సిసి రోడ్డు వేస్తామని అధికారులు హామీ  ఇచ్చారని కాలనీవాసులు తెలిపారు.