రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీ
రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపిన ప్రియాంక గాంధీ. ఢిల్లీ జంతర్ మంతర్లో వారం రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఉన్నాయి. బ్రిజ్భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో నిన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై 2 ఎఫ్ఐఆర్లు ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు.