ప్రొటోకాల్ వివాదం...కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం

ప్రొటోకాల్ వివాదం...కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం

ముద్ర,తెలంగాణ:-మెదక్‌ జిల్లా బడిబాటలో ప్రోటోకాల్‌ వివాదం చెలరేగింది. కొల్చారం మండలం జడ్పీస్కూల్‌లో బడిబాట కార్యక్రమం రసాబాసాగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారు. అయితే.. స్థానిక ఎంపీటీసీ, అధికారులను వేదికపైకి ఆహ్వానించకుండా.. ఇతరులను ఆహ్వానించడంపై సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను నిలదీశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సురేఖ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు.