ప్రతి గడప గడపకు వెళ్తున్నాం అందరి గుండె చప్పుడు వింటున్నాం - రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ప్రతి గడప గడపకు వెళ్తున్నాం అందరి గుండె చప్పుడు వింటున్నాం - రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ఒక్క అవకాశం కల్పించండి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తాం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ ప్రజలను అనేక విధాలుగా మోసం చేసిందనీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రి దామోదర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టణంలోని 32 వ వార్డు 33 వ వార్డులలో మంగళవారం ప్రచారం నిర్వహించి మాట్లాడారుకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తాం అన్నారు.

నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీ దీవెనలు ఇచ్చి గెలిపించండనీ కోరారు.
సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువ నాయకుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు
ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  పెద్దిరెడ్డి రాజా కక్కిరేని శ్రీనివాస్, అంజద్ అలీ సాయి నేత, కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, చంచల శ్రీనివాస్, అక్కినేపల్లి జానయ్య, డిఆర్, ఆలేటి మాణిక్యం, నరేందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు