అమెరికా న్యూజెర్సీ లో తెలంగాణ అవిర్భవ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..

అమెరికా న్యూజెర్సీ లో తెలంగాణ అవిర్భవ దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి..

కేసీఆర్ దోపిడీని ఇంకా ఎంతకాలం భరిద్దాం... తెలంగాణ అభివృద్ధి లో మీరు భాగస్వాములు కావాలి..
కాంగ్రెస్ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాలు ఎంతో శ్రమించి పోరాటాలు చేసి త్యాగాలు చేసి రాష్టాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒక్క కేసీఆర్ కుటుంబమే పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాజకీయాలను అవినీతి మయం చేశారు.

ఇక్కడ అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగడం, అందులో నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.. అమెరికలో ఉన్న తెలంగాణ వాళ్ళు మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. 

తెలంగాణ లో 9 ఏళ్ల పాలన కాలంలో కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేశారు. 17 లక్షల కోట్లు బడ్జెట్ ద్వారా వచ్చింది. 22 లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా తెలంగాణ ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదు.

కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయి లో అమలు చేయలేదు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన అని చెప్పిన టిఆర్ఎస్ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు. కానీ కేసీఆర్ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పాలన చెయ్యలేదు..

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కూడా తెలంగాణ ప్రజలు ఆదరించాలి. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి..