రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

మహాదేవపూర్, ముద్ర: బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ముందు టిఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ వీరు నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రైతులపై ఉన్న డొల్ల ప్రేమ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో బట్టబయలైందని లింగంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రైతాంగం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రాబోయే ఎన్నికలలో గట్టి జవాబు ఇస్తారని పెండ్యాల మనోహర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్ రావు, సర్పంచ్ శ్రీపతి బాపు, పెండ్యాల మనోహర్, రైతు నాయకులు బండం లక్ష్మారెడ్డి, అన్కారి ప్రకాష్,  ఓరేటి రవీందర్ రెడ్డి, చిన్నన్న, తడకల రమేష్, అన్కారి ప్రభాకర్, అలీమ్, చందు, జక్కయ్య, గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.