తొలి ఏకాదశి ఆది పండుగ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముద్ర ప్రతినిధి,మహబూబ్నగర్ : తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలు నింపే పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగ అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ తెలిపారు. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో ఉన్న శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని ప్రార్థించారు.