అమరవీరుల ఆత్మలు శాంతించే విధంగా ప్రజా సేవకు పునరాంకితమవుతాం - ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజ్

అమరవీరుల ఆత్మలు శాంతించే విధంగా ప్రజా సేవకు పునరాంకితమవుతాం - ప్రభుత్వ విప్ డాక్టర్ గువ్వల బాలరాజ్
  • బాధాతప్త హృదయంతో అమరవీరులకు శ్రద్ధాంజలి
  • అసువులు బాసిన అమరుల సంస్కరణల తీర్మానాన్ని ఏకగ్రీవంగా జిల్లా పరిషత్ సర్వసభ ఆమోదం
  • రాజ్యాంగబద్ధమైన సమానత్వ విలువల కోసం జరిగిన మహత్తర పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం - జిల్లా పరిషత్ శాంత కుమారి
  • తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్
  • తెలంగాణ రాష్ట్ర సాధనకు అమరులైన ముగ్గురు కుటుంబ సభ్యులకు ఘనంగా సన్మానం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: అమరుల త్యాగాలను వృధా కానీ ఇవ్వమని,అమరవీరుల ఆత్మలు శాంతించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా ప్రజా సేవకు పునరాంకితం అవుతామని ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు.గురువారం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాంత కుమారి, జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ కే మనోహర్ లతో కలిసి ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజ్ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ.....

తెలంగాణ రాష్ట్రం అవతరించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను కనీ విని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించిందని ఆయన అన్నారు. ఈ ఉత్సవాలు మూడు వారాలుగా వైభవంగా, పండుగ వాతావరణంలో కొనసాగాయ అన్నారు. రోజుకు ఒక రంగం చొప్పున ఆయా రంగాల వారీగా దినోత్సవాలను నిర్వహిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను ప్రజలకు జిల్లా అదికారులు వివరిస్తూ ఘనంగా నిర్వహించారన్నారు. తొమ్మిదేళ్ల హయంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధి వివరిస్తూ కార్యక్రమాలు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమర వీరులకు బాధ తప్ప హృదయంతో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు.


తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు   నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను త్యజించిన అమరుల యాదిలో జరిగిన అభివృద్ధి వెలుగులు నేడు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయన్నారు.దేశ చరిత్రలోనే ఘనకీర్తి కలిగిన తెలంగాణ మట్టిబిడ్డల మనోవేదనకు ముగింపు పడి, త్యాగాల తెలంగాణ బానిస సంకెళ్లను తెంచుకొని స్వరాష్ట్రంలో తలెత్తుకొని సగర్వంగా నిలబడి దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు.అనంతరం ఎస్ జే ఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శాంత కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఎంతోమంది యువతి యువకులు విద్యార్థులు మరియు పౌరుల ఆత్మ బలిదానాలు చేసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుల సంస్కరణ తీర్మానాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాంతకుమారి ప్రవేశపెట్టి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.....

రాజ్యంగబద్ధమైన సమానత్వ విలువ కోసం జరిగిన మహత్తర పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అని ఆమె అన్నారు.అన్ని రంగాల్లో అమలైన వివక్షకు వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయంపాలన కోసం ఉద్యమం కొనసాగిందన్నారు. ఆరు దశాబ్దాలపాటు తొలి, మలిదశల్లో సాగిన ఈ పోరాటం త్యాగపూరితమైనది చారిత్రాత్మకమైనదన్నారు. ఉద్యమం పొడుగునా ప్రజలు అపూర్వమైన దైర్య సాహసాలను ప్రదర్శించారు.అణచివేతను, హింసను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడారని,1969 తొలిదశ పోరాటంలో వందలాది మంది ఉద్యమకారులు పోలీసు కాల్పుల్లో నేలకొరిగారు. అహింసాయుతంగా, శాంతియుత పంధాలో జరిగిన మలిదశ పోరాటంలో ఎంతోమంది యువతీ యువకులు, విద్యార్థులు, పౌరులు ఆత్మబలిదానాలు చేసారన్నారు.ఏ జీవికైనా ప్రాణానికి మించినది మరేది లేదు. అంతటి విలువైన తమ ప్రాణాలను స్వరాష్ట్ర కోసం సమర్పణం చేసిన అమరులు మనందరికీ చిరస్మరణీయులు. వారి త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.
నేడు రాష్ట్రం సాధిస్తున్న ఉజ్వల ప్రగతిలో వారి త్యాగం దేదీప్యమానమై ప్రతిఫలిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో జిల్లా పరిషత్ తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నదని తెలంగాణ.అనన్య సామాన్యమైన వారి త్యాగాలను సగౌరవంగా స్మరించుకుంటున్నదన్నారు. 

అమరుల ఆశయ పునరంకితమవుతున్నదన్నారు.చైర్పర్సన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానంగా ఆమోదించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తీర్మానాన్ని బలపరిచారు.సభ్యులంతా హర్షాతిరేకాల మధ్య ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.అనంతరం నాగర్ కర్నూల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసిన వంకేశ్వర గ్రామానికి చెందిన అమరుడు నాగరాజ్ తల్లి ఈశ్వరమ్మను, ఉప్పునుంతలకు చెందిన అమరుడు బాలస్వామి భార్య అలివేలును కల్వకుర్తికి చెందిన అమరుడు కే కృష్ణయ్య  కుమారుడు కే రామును ఘనంగా శాలువాతో సత్కరించారు.అమరుల కుటుంబాలను ప్రభుత్వ విప్ పాదాభివందనం చేశారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని, అందుకు సహకరించి పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, సహకరించిన పాత్రికేయులను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే మనోహర్, అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా పరిషత్ సీఈవో భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు జడ్పిటిసిలు, ఎంపీపీలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.