తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళి- మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి

తెలంగాణ అమరవీరులకు ఘనమైన నివాళి- మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి

హుజూర్ నగర్, టౌన్, ముద్ర: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. అమరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రంగాల్లో ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఓరుగంటి నాగేశ్వరరావు,ఎరగాని గురవయ్య, చిలకబత్తిని సౌజన్య, కొమ్ము సైదులు, ,నగర పంచాయతీ సిబ్బంది, బిఆర్ఎస్ కార్యకర్తలు ఎడ్ల విజయ్, కుంట సైదులు, మల్లయ్య పాల్గొన్నారు.