హైవేపై రెండు కంటైనర్లు ఢీ: ఇద్దరు సజీవదహనం

హైవేపై రెండు కంటైనర్లు ఢీ: ఇద్దరు సజీవదహనం

ముద్ర ప్రతినిధి,మెదక్: మెదక్ జిల్లా నార్సింగి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం ఉదయం జరిగింది. నార్సింగ్ మండలం కాస్లాపూర్ వద్ద రెండు కంటైనర్ లారీలు ఢీకొనగా...ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక కంటైనర్ లారీలో గ్యాస్ సిలిండర్ ఉండడంతో మంటలు తీవ్రంగా వ్యాపించి ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే అక్కడ ఆటో, ఇన్నోవా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.