సర్కారు బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య..

సర్కారు బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య..

పట్టింపు లేని విద్యాశాఖ

రేగొండ ముద్ర:  సర్కారు బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య.. కారణం ఏమిటి? ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం చాలా వరకు తెలంగాణ రాష్ట్రాoలో ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు పెరుగుతున్నాయి.. కొన్ని చోట్ల అయితే ప్రైవేటు స్కూల్స్ తో పోటీ పడుతున్నాయి. నో అడ్మిషన్స్ అనే బోర్డులు పెట్టే పరిస్థితి ఉంది.. ఇలాంటి సమయంలో కూడా రేగొండ మండల కేంద్రంలోనీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. కారణం ఏంటో తెలుసా.? సర్కారు పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నా ఉమ్మడి రేగొండ మండలoలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదట. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కొంతమేర పెరుగుతున్నా.. అనేక పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణాభత్యం అందిస్తోంది.

మధ్యాహ్నం సన్నబియ్యంతో పోషక విలువలు కలిగిన భోజనం పెడుతోంది. అలాగే రాగిజావా, ఉచిత పాఠ్య, రాత పుస్తకాలతో పాటు ఏకరూప దుస్తులు అందిస్తోంది. ఇంగ్లీష్ మాధ్యమాన్ని సైతం ప్రారంభించింది. అయినా పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం లేదు.మండలంలో పలుచోట్ల ప్రవేశాలు తక్కువఉన్నట్లు తేలింది. దీనిపైప్రత్యేక దృష్టి సారించిమని, బయటి పిల్లలను గుర్తించి, పాఠశాలలో చేర్పించాలని జిల్లా విద్య అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులు ఎక్కువగా అటువైపు ఆసక్తి చూపుతున్నట్లు పిల్లల తల్లిదండ్రులు తెలుపుతున్నారు..

మండలంలోని ఆయా గ్రామాల పాఠశాలల్లో పిల్లల సంఖ్య చాలా దయనీయంగా ఉంది మండలంలోని సుల్తాన్ పూర్ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు కొనరావ్ పేటలో ఎనమిది మంది ఉంటే ముగ్గురు ఉపాధ్యాయులు చిన్న కోడేపక గ్రామంలో నలభై మంది విద్యార్థులు ఉంటే పదిహేను  ఉపాధ్యాయులు కాకర్ల పల్లిలో ముప్పై మంది విద్యార్థులు పది సంఖ్యలో టీచర్లు ఇలా అనేక గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.ప్రభుత్వాలు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా పెంచాలని అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఆశించిన ఫలితాలు రావడం లేదు పుట్ట గొడుగుల్ల ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకు రావడం అధికారులు వత్తాసు పలకడం వల్ల రోజు రోజుకు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలలో చేరుతున్నారు.మరి కొన్ని గ్రామాల్లో విద్యార్థుల సంఖ్య లేక పోవడంతో పాఠశాలలు మూసి వేసిన పరిస్తితి ఏర్పడింది.