అదృష్యమైన మహిళ ఆత్మహత్య

అదృష్యమైన మహిళ ఆత్మహత్య

ముద్ర ప్రతినిధి భువనగిరి: మూడు వారాల క్రితం అదృష్యమైన ఓ వివాహిత చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా పరిధిలో  భూక్య శారద(25) అనే వివాహిత మూడు వారాల క్రితం అదృశ్యమైంది.

అయితే మృతురాలు గ్రామం పక్కన ఓ మామిడి తోటలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రూరల్ ఎస్సై వి.  సంతోష్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.