గుడిమల్కాపూర్ మార్కెట్ రోడ్డు మరమ్మతుకు 50 లక్షలు మంజూరు

గుడిమల్కాపూర్ మార్కెట్ రోడ్డు మరమ్మతుకు 50 లక్షలు మంజూరు

హైదరాబాద్: గతుకుల మయంగా ఉన్న గుడిమల్కాపూర్  మార్కెట్ రోడ్ మరమ్మతుల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం నాడు అయన రోడ్డు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మాజీ కార్పొరేటర్ బంగారు ప్రకాష్ తదితరులు ఆయనకు పరిస్థితిని వివరించారు. వర్షం కురిసినప్పుడు రోడ్లు నదులను తలపిస్తున్నాయని  కాలనీవాసులు యాదన్న, సుబ్బారావు, సందీప్, వెంకటేష్ , రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.