చేపలు పడుతూనే.. చెరువులోనే పడి మత్స్యకారుని మృతి... 

చేపలు పడుతూనే.. చెరువులోనే పడి మత్స్యకారుని మృతి... 

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పోలంపల్లితండ గ్రామపంచాయతీ పరిధిలోని దస్తరాజులచెరువులో చేపలు పడుతున్న ఆలేటి శ్రీను(38) సోమవారం ఒక్కసారిగా చెరువులోనే   కుప్పకూలి మరణించాడు. రాజోలు గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఎప్పటిలాగే చేపలుపట్టడానికి వెల్లాడు. ఇతర మత్స్యకారులతో కలిసి వలవేస్తూ చేపలు పడుతున్నాడు. శ్వాసలో కొంత ఇబ్బందిగా ఉందంటూ వలను వదిలి చెరువు ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేసాడు. కొంతదూరం నడవగానే చెరువులోనే కుప్పకూలిపోయాడు.

వెంట ఉన్నవారు.. పరుగున వచ్చి సపర్యలు చేసినప్పటికీ  పలితం లేకపోగా ప్రాణాలు విడిచాడు. ఇంతసేపు తమతో కలిసి సరదాగా గడిపిన శ్రీనివాస్ తమ కళ్ళముందే విగతజీవిగా మారడంతో ఆ..ప్రాంతమంతా విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న రాజోలు, సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకొని కన్నీరు కార్చారు. కురవి ఎస్ఐ రామునాయక్ ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భారాస మండలపార్టీ అద్యక్షులు తోటలాలయ్య మృతదేహం వద్దకు చేరుకుని నివాళులు అర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చారు.