మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు అలర్ట్...
![మేడారం జాతరకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు అలర్ట్...](https://mudranews.in/uploads/images/2024/02/image_750x_65d46474c0704.jpg)
ముద్ర,తెలంగాణ:- మేడారం జాతరకు ఆర్టీసీలో వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మహిళలు ఉచితంగా మేడారం బస్సుల్లో వెళ్లవచ్చని వివరించారు. అయితే.. ఈ బస్సుల్లోకి కోళ్లు, గొర్రెలు వంటి మూగ జీవాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.మేడారం జాతర కోసం రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా బస్సులను నడుపుతున్నామని సజ్జనార్ తెలిపారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.