హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

 ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి పల్లే పల్లెకు విజ్జన్న అనే నినాదంతో ఓదెల మండల కేంద్రంలో పాదయాత్ర చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సంధర్బంగా విజయరమణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల అందిస్తమహిళా సోదరీమణులకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ, 500/- రూపాయలకే వంట గ్యాస్, వంటి పథకాలు అందిస్తామని అన్నారు.

పెద్దపల్లి మండలంలో, ఓదెల గ్రామంలో పాదయాత్రగా ప్రతీ గడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకొని ప్రజలతో అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్ర చేశారు. ఈ బీఆర్ ఎస్ ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యవసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుమూల ప్రేంసాగర్ రెడ్డి, గోపతి సది, బోడకుంటా శెంకర్, బోడకుంటా రాజయ్య,పిట్టల రవి కుమార్, ak చీకట్ల మొందెయ్య, చింతం కుమారస్వామి, నగపూరి రవి బోయ సంతోష్, కంకణాల భాస్కర్ రెడ్డి, రెడ్డి రజికాంత్,, అల్లా సుమన్ రెడ్డి అంబాల కొమురయ్య, రౌతు మనోజ్,కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ మహిళలు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు.