తిమ్మాపురం లో అయ్యప్ప పడిపూజ

తిమ్మాపురం లో అయ్యప్ప పడిపూజ

ముద్ర ప్రతినిధి భువనగిరి: మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో సోమవారం రావుల రాజు గురుస్వామి 18 వ పాదం సందర్భంగా హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మండల మహా పడిపూజ కార్యక్రమం మహేష్ గురుస్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు నిర్వహించగా పడిపూజ తో స్వాములకు అన్నసంతర్పనం  చేశారు.

ఈ కార్యక్రమంలో మోహన్ గురుస్వామి పాల్గొని ఆశీర్వచనాలు చేయగా గురుస్వాములు రాచర్ల రమేష్, దేవనక అంజయ్య, సుధగాని రాజు గౌడ్,రాంపల్లి చంద్రం  గౌడ్, రాణా వెంకటేష్, మచ్చ నర్సింహ, గుట్ట అనిల్, తన్నీరు శ్రీనివాస్, కృష్ణ గురు, జిన్న నర్సింహ, శివ శంకర్, కొండం ఉపేందర్, ఈదులకంటి కరుణాకర్, శివ, కొండల్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే యువజన నాయకులు యెడ్ల వెంకట్ రెడ్డి, సర్పంచ్ పిన్నం లత రాజు, ఎంపీటీసీ వుడుత శారద ఆంజనేయులు, పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.