దుర్గాదేవి ఆశీర్వాదాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి

దుర్గాదేవి ఆశీర్వాదాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి
  • ధర్మారంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: దుర్గాదేవి ఆశీర్వాదాలతో మంథని నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని బీఆర్ఎస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు అన్నారు. .మంథని మండలం ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధు సోమవారం  ప్రత్యేక పూజలు చేశారు. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో బాగంగా ధర్మారం గ్రామంలో  ప్రతిష్టించిన దుర్గామాతను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సాయి బ్రిక్స్ ను ప్రారంభించిన పుట్ట మధు 

ధర్మారం గ్రామంలో ఎంపిటిసి తోంబరపు సుజాత తిరుపతి ఎర్పాటు చేసిన శ్రీ సాయి బ్రిక్స్ ను మంథని  పుట్ట మధు ప్రారంభించారు. ఆయన  వెంట జడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్, ఏఎంసీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళం శంకర్ గౌడ్, స్థానిక సర్పంచ్ రవి, ఎంపీటీసీ తిరుపతి,  మాజీ సర్పంచ్ బాపు, ముత్యాల లింగయ్య, జింజర్ల శేఖర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు