బిఆర్ఎస్ యువజన విభాగం సమావేశం

బిఆర్ఎస్ యువజన విభాగం సమావేశం

ముద్ర న్యూస్ గన్నేరువరం/కరీంనగర్, మే 25, గన్నేరువరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు సురేష్ ఆధ్వర్యంలో గురువారం రోజున బిఆర్ఎస్ యువ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు హాజరై మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో యువత కీలకమని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గడపగడపకు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్న గారిని హ్యాట్రిక్ విజయం అందించాలని దానికి అందరూ ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పని చేయాలని యువజన సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం గన్నేరువరం మండల యువజనుల ఏకగ్రీవ తీర్మానం జరిగింది. బిఅర్ఎస్ యువ ప్రతినిధుల సమావేశం భారీ సంఖ్యలో హాజరైన యువజన సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, మానకొండూరు జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, గన్నేరువరం సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్, ఉపసర్పంచ్ బూర వెంకటేశ్వర్, వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్, బొడ్డు సునీల్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం తిరుపతి రెడ్డి, మండలంలోని ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో యువజన మిత్రులు పాల్గొన్నారు.