భరోసా సెంటర్ భవన నిర్మాణాన్ని పరిశీలించిన సిపి

భరోసా సెంటర్ భవన నిర్మాణాన్ని పరిశీలించిన సిపి

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భరోసా సెంటర్ భవనాన్ని గురువారం సాయంత్రం సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి సందర్శించారు. నాణ్యతతో కూడిన పనులు చేసి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏబి దుర్గ, భరోసా సెంటర్ సిబ్బంది వినోద, సౌమ్య, హరిత, రేణుక, భవాని, నవనీత, అనుష, స్నేహిత మహిళా సపోర్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుజాత రాజ్, కౌన్సిలర్స్  వసంత, సుష్మ, ఫీల్డ్ వర్కర్ సూర్యప్రభ, స్వరూప నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.