గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
Candles in Nirmal

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వేధింపులతో మృతి చెందిన ప్రీతి కి సానుభూతిగా, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్మల్ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంతాపం ప్రకటించారు. ప్రీతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎక్స్ గ్రేషియా పెద్ద మొత్తంలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.