బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి: మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్

బీజేపీతోనే గ్రామాల అభివృద్ధి: మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్
villages Development with with BJP only babu mohan

 ముద్ర ప్రతినిధి, జనగామ: కేంద్రంలోని బిజెపి సర్కార్ అందజేస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బిజెపి నేత, మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం  దేవరుప్పుల,  ధర్మపురం గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. శక్తి కేంద్ర ఇంచార్జి చింత సృజన్, గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో బాబు మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో బీజీపీ రాష్ట్ర నాయకులు లేగ రాంమోహన్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు దుబ్బ రాజశేఖర్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ పెద్దగౌని రాజు , కాసాని సత్తయ్య, గోలి ఉప్పల్ రెడ్డి , నర్సింహ చారి, సంగి రాజు, తదితరులు పాలుగొన్నారు.