హుస్నాబాద్ లో రైస్ మిల్లులను సందర్శించిన పౌరసరఫరాల సంస్థ చైర్మన్

హుస్నాబాద్ లో రైస్ మిల్లులను సందర్శించిన పౌరసరఫరాల సంస్థ చైర్మన్

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి :రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ గురువారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గల పలు మిల్లులను సందర్శించి రైసుమిల్లులలో ధాన్యం దిగుమతులను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మ రావు,జిల్లా పౌర సరఫరాల సంస్థమేనేజర్ హరీష్ తో కలిసి జిల్లాలో  ధాన్యం కొనుగోళ్ళ గురించి ఆరా తీసారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచేలా చూసి , వెను వెంటనే రైస్ మిల్లులకు తరలించి, దిగుమతిలో ఎటువంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు.