అంజన్న హుండీ ఆదాయం 86 లక్షలు...

అంజన్న హుండీ ఆదాయం 86 లక్షలు...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. 22 రోజులకు సంబందించి, మొత్తం 12 హుండీలు లెక్కించగా, 86 లక్షల 92 వేల 556 రూపాయల  ఆదాయం వచ్చినట్లు ఈవో టంకశాల వెంకటేష్ తెలిపారు. అలాగే 9 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 150 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ 40 నోట్లు వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ ట్రస్టీ టి. మారుతి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఏ. చంద్రశేఖర్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరిండెంట్ సునీల్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆలయ సిబ్బంది, శివశక్తి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.