తెలంగాణలో వానలు కురిసే అవకాశం

తెలంగాణలో వానలు కురిసే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి 15,16,17,18 తేదీలలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పగటి పూట ఎండలు, సాయంత్రానికి వర్షాలు కురుస్తాయని తెలిపారు.  15 వ తేదిన ఒకటి.. రెండు చోట్ల ఉరుములు మెరుపులు,ఈదురు గాలులతో  కూడిన వర్షాలు పడడున్నాయన్నారు. 16 న ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. 17,18 తేదీలలో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో చేతికి వచ్చిన పంటను బద్రపరుచూ కోవాలని వాతావరణ అధికారులు రైతులకు సూచించారు.