ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్
![ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_64020fce67fbb.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) గోడౌన్ను కలెక్టర్ శివలింగయ్య శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి గోడౌన్ పరిశీలించినట్టు చెప్పారు. ఆయన వెంట జనగామ ఈఆర్వో సిహెచ్.మధుమోహన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు వి.గంగాభవానీ, సిబ్బంది శంకర్ ఉన్నారు.
అనంతరం లింగాలఘణపురం మండలం కుందారం గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు క్యాంపును, కళ్లెంలో నిర్మిస్తున్న టెక్స్ టైల్ పార్క్ ను క కూడా కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్ సి.అంజయ్య, ఉప వైద్యాధికారి డాక్టర్ సుధీర్, డా.సంధ్య, క్యాంపు నిర్వాహకులు ఉన్నారు.