కలెక్టరేట్ లో జర్నలిస్టులకు కంటి పరీక్షల నిర్వహణ
![కలెక్టరేట్ లో జర్నలిస్టులకు కంటి పరీక్షల నిర్వహణ](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d13603947b2.jpg)
భువనగిరి (ముద్ర న్యూస్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలను వెంటనే అందించారు.
జర్నలిస్టుల కంటి పరీక్ష శిబిరాన్ని రెవిన్యూ అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున రావు, టియూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు యంబ నర్సింహులు, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి కరుణాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరాటి రవి, జాతీయ కార్యవర్గ సభ్యులు భువనగిరి మల్లేష్, భువనగిరి పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎండి జమాలుద్దీన్, ప్రతినిధులు శ్రీనివాస్, కూరెళ్ళ మల్లేశం,ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.