కాంగ్రెస్ నాయకుల విజయోత్సవ సంబరాలు
![కాంగ్రెస్ నాయకుల విజయోత్సవ సంబరాలు](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645fa09f1208c.jpg)
ముద్ర న్యూస్ రేగొండ:రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ బారి విజయం సాధించటం పట్ల సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య మాట్లాడుతూ.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించటం రాహుల్ గాంధీ విజయం అని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ నాయకుడు గండ్ర సత్యనారాయణ గెలుపు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుటోజ్ కిస్టయ్యా, మేకల భిక్షపతి, బానోతు రవీందర్,ముడుతన పల్లి శంకర్, నాగపూరి మోగిలి, శ్రీధర్,తోట రఘు,రవి అమీర్,తదితరులు పాల్గొన్నారు..