తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం..

తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం..

ముద్ర,హైదరాబాద్:-  మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం చోటు నెలకొంది. ఆయన సోదురుడు తలసాని శంకర్ యాదవ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్.. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. . మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శంకర్ యాదవ్.. గతంలో బోయిన్‌పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా పని చేశారు. దీంతో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.