అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఇవాళ‌ నోటీసులు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టుకు హాజరైనప్పుడు తీసిన వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సూచించింది. దీనిపై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మలతో కూడిన బెంచ్ ఆదేశాలిచ్చింది. కేజ్రీవాల్ గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో చేసిన ప్రసంగం కాసేపటికే సోషల్ మీడియాలో కనిపించింది.