పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం
![పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం](https://mudranews.in/uploads/images/2023/01/image_750x_63d64ec2e3c7a.jpg)
ఎల్లారెడ్డిపేట, ముద్ర: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన దుంపెన రమేష్ కు "పర్యావరణ పరిరక్షణ హరిత మిత్ర స్ఫూర్తి పురస్కారం" ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ వారు శాలువతో సత్కరించి అందజేశారు. రమేష్ సాహితీ రంగంలో చిగురు, గుమ్మడి పూలు, తులసి పుస్తకాలు రాశారు.
గత 15 సంవత్సరాలుగా మొక్కల పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. తన సేవలను గుర్తించిన స్వచ్ఛంద సంస్థ వారు ఈ పురస్కారాన్ని అందజేయడం తనకు సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ పురస్కారం లభించడం పట్ల బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సేస్ డైరెక్టర్ కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి,డా.జి. సత్యనారాయణ స్వామి, కవి రచయిత వాసర వేణి పరిసరాములు తదితరులు అభినందించారు.