రైతులకు హామీలు కాదు పరిహారం అందివ్వాలి

రైతులకు హామీలు కాదు పరిహారం అందివ్వాలి
  • సంజయ్ గాలి తిరుగుళ్లు బంద్ చెయ్
  • మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : వడగండ్ల వర్షాల మూలంగా పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇవ్వకుండా నష్ట పరిహారం ఇవ్వాలని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం రామడుగు మండలంలోని చిప్పకుర్తి, రామచంద్రాపూర్, గుండి గ్రామాల్లో పలు రైతుల పంట పొలాలను మామిడి తోటలను, కరబూజ పంటలను పరిశీలించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. నేడు పంటల పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో రైతులకు హామీలు ఇవ్వకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మంజూరు చేసిన విధంగా నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు.

కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ గాలి తిరుగుళ్ళు మానేసి రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని, వర్షాల మూలంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించి రైతులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న వెంకట్ రామ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ యువజన కాంగ్రెస్ పార్లమెంటరీ మాజీ అధ్యక్షులు నాగి శేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రాజమల్లయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్ కాడే శంకర్, బ్లాక్ ప్రెసిడెంట్ బుచ్చయ్య, రాజిరెడ్డి, ముద్దం తిరుపతి గౌడ్, పురం రాజేశం, మాధవరెడ్డి, రాజేష్ కన్నా, కడారి రాయుడు, నాగరాజ్, బాపురాజ్, శ్రీనివాస్ రెడ్డి, రంగన్న,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.