ఫైళ్ల శేఖర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి

ఫైళ్ల శేఖర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి

 వలిగొండ, ముద్ర: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన సతీమణి పైళ్ల వనిత కోరారు. బుధవారం  మండల పరిధిలోని గొల్నేపల్లి, గుర్నాథ్ పల్లి  గ్రామాలలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతు సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు  ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.

వాటితో పాటు శేఖర్ రెడ్డి తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు అత్యధిక ఓట్లు వేసి  అత్యంత మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడూరు శివశాంత్ రెడ్డి, జువ్వి మంజుల, గూడూరు శ్రీధర్ రెడ్డి, ఆవుల నర్సింహ, కల్కురి నర్సింహ,తోట శ్రీనివాస్,వెంకట్ రెడ్డి, మల్లేష్,యాదయ్య, మల్లారెడ్డి, జయ కుమార్, భిక్షపతి, జలందర్ రెడ్డి  పాల్గొన్నారు.