శ్రీ స్వామివారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్

శ్రీ స్వామివారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్

యాదగిరిగుట్ట, ముద్ర : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని శుక్రవారం రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలకగా ప్రధాన ఆలయంలో స్వయంభులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు, అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు అభిషేక లడ్డు ప్రసాదం అందజేశారు.