తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుని కి తీవ్ర గాయాలు

తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుని కి తీవ్ర గాయాలు

మెట్‌పల్లి ముద్ర: తాటిచెట్టు పై నుండి పడి గీత కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చెర్ల కొండుపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన సుద్దాల అంజయ్య గౌడ్ గీత కార్మికుడు శుక్రవారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కగా ఒక్కసారి గా మోకు జారీ పోవడంతో చెట్టు పై నుండి కింద పడటం తో చేతి కి, తలకి, కాలు కు తీవ్ర గాయాలు కాగ హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అంజయ్య కాలు విరిగినట్లు గీత కార్మికులు తెలిపారు. బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం అధ్యక్షులు పెరుమాండ్ల భూమాగౌడ్, నాయకులు ఆరెళ్ల రాజగౌడ్, జగన్ గౌడ్,గీత కార్మికులు కోరారు.