నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో హాథ్ సే హాథ్ జోడో కాంగ్రెస్ పోరు యాత్ర

నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో హాథ్ సే హాథ్ జోడో కాంగ్రెస్ పోరు యాత్ర

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండల కేంద్రంలో ఆదివారం మూడో రోజు హాథ్ సే హాథ్ జోడో కాంగ్రెస్ పోరు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వక్తలు మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి, రాష్ట్రంలోని భారాస లు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాయని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. ఈ పాదయాత్రలో  ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.